ఉప్పొంగిన ప్రజాభిమానంతో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ పట్టణంలో జనసంద్రమైనది. సోమవారం
బస్సు యాత్రలో భాగంగా మార్గమధ్యలో తొర్రూర్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆగి ప్రజలకు అభివాదం చేసి కాసేపు ప్రసంగించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. కేసీఆర్ వెంట
మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, తదితరులు ఉన్నారు.