నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన కూరాకుల వరలక్ష్మి కుమారుడు నితిన్ ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణించడం జరిగింది. బాల్యం నుంచి తమతో సీఎస్ఐ మిషన్ హైస్కూల్లో చదువుకున్న మిత్రురాలికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు సంతానం ఉండగా కుమారుడు చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. బాల్య మిత్రులందరూ కలిసి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని సానుభూతి తెలియజేస్తూ రూ. 22 వేలు ఆర్థిక సహాయంగా అందజేశారు.