రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ దోహదపడుతుందని వాటి పునఃనిర్మాణానికి చేయూతనందించి స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండలం తీగరాజు పల్లి గ్రామ పరిధిలోని సొమ్లా తండాలో రూ. 18. 50 లక్షలతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సౌజన్యంతో నిర్మించిన కనపర్తి ఎఫ్ఏసిఎస్ గోదాంను ఆయన ప్రారంభించారు.