హనుమకొండ: ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలి

59చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు టాయిలెట్ల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం తోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యా వనరుల కేంద్రంలో పాఠశాలలకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాల గురించి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్