జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగాపురం ఇందిరా తనయుడు ఇమ్మానియేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ రాములవారిని దర్శించుకున్నారు. ఆ రాముల వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు.