వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు వడ సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా, శంభునిపేట మంగళమ్మకుంట ప్రాంతానికి చెందిన సంపంగి రాకేశ్, వంశీకృష్ణలు చెరొక సంచి పట్టుకొని వెళుతూ కనిపించారు. అనుమానంతో పోలీసులు ఆపగా వారివద్ద ఉన్న సంచులు సోదాచేయగా 7,400 కిలోల గంజాయి లభ్యమైంది. దాని విలువ సుమారు రూ. 1. 42 లక్షలు ఉంటుందని సీఐ మల్లయ్య తెలిపారు.