వరంగల్ ములుగురోడ్ లోని శ్రీగణపతి సచ్చిదానంద వరద దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తైలాభిషేకం నిర్వహించారు. ఆషాఢ మాసం నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతీ ఆదివారం దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్సీ స్వామివారిని దర్శించుకున్నారు.