రాష్ట్రం, జిల్లాలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్నందున వేసవి కాలంలో తీవ్రమైన ఎండ వేడి గాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం కలదని, ప్రజలందరూ తగిన జాగ్రతలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. బి. సాంబశివ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ దెబ్బకు గురైనప్పుడు ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి కొన్ని లక్షణాలు గాని కనిపిస్తాయని పేర్కొన్నారు.