పీరీల పండగ సందర్భంగా భక్తి పారవశాల మధ్య ఊరేగింపులు

58చూసినవారు
పీరీల పండగ సందర్భంగా భక్తి పారవశాల మధ్య ఊరేగింపులు
మొహరం నెల మొదటి పది రోజులలో జరుపుకునే పీర్ల పండుగను వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో బషీర్ సాహెబ్ వంశ పరంపరంగా వస్తున్న పిరిల పండగను మంగళవారం ఘనంగా జరిపారు. సయ్యద్ బషీర్ సాహెబ్ మాట్లాడుతూ.. కర్బలా యుద్ధ మైదానంలో హసేన్ హుస్సేన్ ప్రాణత్యాగం గుర్తు చేసుకుంటూ పీరీలను ఊరేగిస్తామన్నారు. నిర్విరామంగా పది రోజులపాటు జరిగే ఈ పండుగను పలు గ్రామాలలో ఘనంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్