గర్భగుడిలోకి నీరు.. స్పందించిన ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్

78చూసినవారు
గర్భగుడిలోకి నీరు.. స్పందించిన ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్
అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు..ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర స్పందించారు. లీకేజీ నిజమేనని అంగీకరించిన ఆయన..దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని వెల్లడించారు. “మొదటి అంతస్తు నుంచి వర్షం నీరు కారడాన్ని చూశాను. శిఖర నిర్మాణం పూర్తయితే అది కవర్ అవుతుంది”అని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్