ఎంపీగా ప్రమాణం చేసిన ‘ఇందిరా గాంధీ’ హంతకుడి కుమారుడు

72చూసినవారు
దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ని హత్య చేసిన బాడీగార్డుల్లో ఒకరైన బీంట్ సింగ్‌ కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్ ఖల్సా ఇవాళ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ స్థానం నుంచి ఖల్సా స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో పంజాబీ భాషలోనే ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత ‘వహే గురూజీ కా ఖల్సా, వహే గురూజీ కీ ఫతేహ్‌ ’ అని సరబ్‌జీత్‌ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్