భారత్-సౌతాఫ్రికా మధ్య నేటి రాత్రి టీ20 వరల్డ్కప్ ఫైనల్ జరుగనుంది. అయితే, ఈ టోర్నీలో మునుపెన్నడూ చూడని ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఫైనల్స్కు చేరిన రెండు జట్లు.. ఈ టోర్నీలో ఒక్కటంటే ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. గ్రూప్ దశ, సూపర్-8లలో అన్ని మ్యాచ్ల్లోనూ విజయఢంకా మోగించాయి. టీ20 వరల్డ్కప్ చరిత్రలో రెండు జట్లు ఇలా అజేయంగా ఫైనల్స్కి చేరడం ఇదే తొలిసారి. మరి టైటిల్ ఎవరు సాధిస్తారో చూడాల్సిందే.