AP: రాష్ట్రంలో స్కూల్స్, హాస్టల్స్లో ఫైన్ రైస్ అందించ బోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏలూరులోని నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల పూర్తి భద్రతకి కూటమి ప్రభుత్వంలో వంద శాతం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వాట్సాప్ ద్వారా 200 సేవలు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లోనూ శిక్షణ పొందాలన్నారు.