ఆరోగ్యశ్రీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించినా.. ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని మినహాయింపులిచ్చాయి. మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి వైద్యాన్ని అందిస్తామని చెప్పారు ఆస్పత్రుల ప్రతినిధులు. వ్యాధి నిర్థారణ పరీక్షల్లో 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు. ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని ఏపీ ప్రైవేట్ మెడికల్ కాలేజీస్ అసోసియేషన్ స్పష్టం చేశారు.