రూ.24 కోట్లు ఇచ్చి కొన్నాం.. వికెట్ ఏదీ?

1073చూసినవారు
రూ.24 కోట్లు ఇచ్చి కొన్నాం.. వికెట్ ఏదీ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచిన మిచెల్ స్టార్క్‌పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. ఈ ఆసీస్ ఆటగాడిని మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75 కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంది. అయితే ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 2 మ్యాచులాడిన అతడు.. ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. మొత్తం 8 ఓవర్లు వేసిన స్టార్క్ ఏకంగా 100 పరుగులు ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

సంబంధిత పోస్ట్