కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్సభ అభ్యర్థి సురేంద్రన్పై 242 క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. ఈసీ నిబంధనల మేరకు ఆయన తనపై ఉన్న కేసుల వివరాలను 3 పేజీల్లో వెల్లడించారు. అయితే వీటిలో 237 కేసులు 2018 శబరిమల ఆందోళనల్లో నమోదైనవేనని ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జార్జ్ కురియన్ తెలిపారు. కాగా వయనాడ్లో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.