తెలంగాణలోని ప్రభుత్వ బడులను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాఠశాలల ఆధునీకరణకు సుమారు రూ.600 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం మరమ్మతులపై కూడా మంత్రి వర్గంలో చర్చించనట్లు పేర్కొన్నారు. మేడిగడ్డపై ఎన్ఢీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించనట్లు తెలిపారు.