రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయని తెలిపారు. టోల్గేట్ల వద్ద సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ‘కాకినాడలో తొలిరోజు తనిఖీల్లో 6 గోదాముల్లో లోపాలు గుర్తించాం. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించాం. 7615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశాం’ అని తెలిపారు.