తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రతిపక్షాలు తమ మేనిఫెస్టోలో చెప్తున్నారని, ఇది అంబేద్కర్ను అవమానించడమేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ చెప్పారని, కానీ విపక్ష నేతలు అదే చేస్తామంటున్నారన్నారు. భారత్లో తాలిబాన్ పాలనను అమలు చేయనివ్వబోనివ్వమని స్పష్టం చేశారు.