రాజ్యాంగం దేశంలోని పేద ప్రజల ఆత్మ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భింద్లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు రాజ్యాంగాన్ని ఏ ఒక్కరూ తాకలేరని, కానీ బీజేపీ నేతలు మాత్రం కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని చెరిపేయడాన్ని రైతులు, కార్మికులు సహించబోరని.. దాన్ని తాము కాపాడి తీరుతామని స్పష్టం చేశారు.