ఏపీలని రైతులకు కూటమి సర్కారు శుభవార్త చెప్పింది. వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్ ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్ లేక గతంలో అనేక ఇబ్బందులు పడ్డామని ఆయన గుర్తు చేశారు. దేశంలో మొదట విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు టీడీపీ తెచ్చిందని, కరెంట్ బిల్లుల విషయంలో కీలక సంస్కరణలు తెచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.