నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ గర్జించిందని మాజీ మంత్రి
కేటీఆర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో వందల కిలోమీటర్లు గోదావరి ప్రవహిస్తున్నా గతంలో ఎడారిగా ఉండేది. కాంగ్రెస్ చేపట్టింది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం. 3 పిల్లర్లు కుంగితే బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. మార్చి1న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అందరం మేడిగడ్డకి వెళ్తాం. కాళేశ్వరం అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు చూపిస్తాం' అన్నారు.