కాళేశ్వరం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం: కోమటిరెడ్డి

74చూసినవారు
కాళేశ్వరం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం: కోమటిరెడ్డి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. సాంకేతిక కమిటీ సూచనలకు విరుద్ధంగా పని చేసి ప్రజాధనం వృథా చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా రైతులకు నీరు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్