లోక్సభ ఎన్నికల వేళ ఓటు వేసేందుకు వెళ్లిన బాలీవుడ్ స్టార్ నటి విద్యా మాల్వడేకి చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేసేందుకు ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు డీటెయిల్స్లో తన పేరు లేకపోవడంతో ఓటేయలేపోయినట్లు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘మూడు గంటలు లైన్లో వేచి చూశాను. నా పేరు కనిపించలేదు. నేను ఇక్కడే పెట్టి పెరిగినా ఇక్కడ నాకు ఓటు హక్కు లేదు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.