ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్, దుర్గాభవానీల వివాహం ఈనెల 21న అన్నవరం క్షేత్రంలో జరుగనుంది. అయితే వారి పెళ్లి ఆహ్వాన పత్రిక అందరీని ఆకట్టుకుంటుంది. నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండుగ వరకు జరిగే సుమారు 45 ఘట్టాలను, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచి, ప్రతి ఘట్టానికి ఒక క్యూఆర్ కోడ్ రూపొందించారు. కోడ్ స్కాన్ చేస్తే ఆ ఘట్టాన్ని వీక్షించేలా శుభలేఖలను తయారుచేయించారు.