పొరుగింటి వ్యక్తుల గొడవను అడ్డుకునేందుకు వెళ్లి మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి మండలం తిమ్మక్పల్లిలో తల్లిదండ్రులతో శేఖర్ గొడవ పడ్డాడు. గొడవను అడ్డుకునేందుకు పక్కింటివారు నారాయణ, లక్ష్మీ, రాజు వెళ్లి ఆపడానికి ప్రయత్నించారు. కోపంతో ఊగిపోయిన శేఖర్.. అడ్డువచ్చిన ముగ్గురిపై ఇటుకలతో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళ లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది.