ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో సీఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చూస్తు ఊరుకుందామా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను సైతం కేంద్రం నెరవేర్చలేదని అన్నారు. BRS అంటే.. బిర్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్స్ ఎన్నికల్లో బిర్లా రంగా సమితిని ఓడించామని అన్నారు. ఫైనల్స్ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాను ఓడించాలని ప్రజలను కోరారు.