మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కెరస్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థితిలో ఉండడం. అయితే మధుమేహులు కాకరకాయలు, నేరేడుపండు, మెంతులు, దంపుడు బియ్యం, ముడి బియ్యం, ఆకుకూరలు, క్యారెట్ వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల డయాబెటిస్ను తగ్గించుకోవచ్చు. ఇక మామిడి పండు, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, అరటిపండు, కిస్మిస్, ఖర్జూరం, ఆలుగడ్డ, పాలిష్ చేసిన బియ్యం వంటి పదార్థాలు తీసుకోవద్దు.