ఫైబర్నెట్ సంస్థ ఆదాయాన్ని హామీగా చూపి గత ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.1,250 కోట్లు అప్పు తెచ్చింది. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఖర్చు చేయలేదు. ఇందులో రూ.950 కోట్లు భారీగా కమీషన్ తీసుకుని సీసీ కెమెరాలను పర్యవేక్షించే కాంట్రాక్టరుకు జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ వ్యవహారంలో పర్సంటేజీల రూపంలో సుమారు రూ.150 కోట్లు చేతులు మారినట్లు సమాచారం.