‘‘దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. ఇదే మాట నేను ఉప ఎన్నిక సమయంలో చెప్పాను. 2020 నవంబర్లో నేను చెప్పిందే ఇప్పుడు నిజమైంది‘‘ అని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు.