నేడు ప్రధాని మోదీ గుజరాత్లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది.