గ్రూప్స్ అభ్యర్థులు వచ్చి పోస్టులు పెంచాలని కోరితే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. BRS కార్యాలయానికి వచ్చి గ్రూప్స్ రాసే విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. గ్రూప్-1, 2 మెయిన్స్ పరీక్షకు 1:100 చొప్పున అనుమతి ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు.. మరి ఇప్పుడెందుకు గ్రూప్స్ మెయిన్స్కు 1:100 ఇవ్వడం లేదని ప్రశ్నించారు.