శత్రువులను జయించడానికి, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదని చెబుతారు. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ప్రతి సంవత్సరం జేష్ట మాసం చివరిలో ఆషాడమాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడుతారు.