ఫేక్ వార్తల ప్రచారానికి అలవాటు పడ్డ సీఎం రేవంత్ ను జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 'నా బంధువుకు రూ.10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ అబద్ధం చెప్పాడు. నేను సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారు. ఓయూకి సంబంధించిన నకిలీ సర్క్యులర్ను పోస్టు చేశాడు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.