అమెరికాలో తొమ్మిదేండ్ల క్రితం దారుణం జరిగింది. భద్రేశ్కుమార్ చేతన్భాయ్ పటేల్ (భారతీయుడు) అనే వ్యక్తి తన భార్యను దారుణంగా చంపాడు. అనంతరం భార్యను హత్య చేసి పరారైన భద్రేశ్కుమార్ చేతన్భాయ్ పటేల్పై అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) భారీ రివార్డు ప్రకటించింది. నిందితుడి అచూకీ తెలిపిన వారికి 2,50,00 డాలర్లు(రూ.2.1 కోట్లు) ఇస్తామని ప్రకటించింది. భద్రేశ్కుమార్ను ఎఫ్బీఐ టాప్-10 మోస్ట్వాంటెడ్ జాబితాలో చేర్చింది.