వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. ఆయన సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం సీఎం రేవంత్రెడ్డి తర్వాత అంతగా కష్టపడేది తానేనన్నారు. అధిష్ఠానం తన కృషి గుర్తించి టికెట్ ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే తన లాంటి సీనియర్ నాయకుల పరిస్థితేంటని ప్రశ్నించారు.