నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్

21557చూసినవారు
నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వైన్స్ బంద్ కానున్నాయి. ఇవాళ్టి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు. కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్