మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2025) ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యూపీ వారియర్స్ జట్టు సారథిగా భారత ఆల్రౌండర్ దీప్తి శర్మను నియమిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. అలీసా హీలీ గాయపడటంతో ఆమె స్థానంలో దీప్తి శర్మ కెప్టెన్గా వ్యవహరించనుంది.