యాదాద్రిలో భక్తుల రద్దీ

72చూసినవారు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. రద్దీ కారణంగా ఉచిత ధర్మదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులతో కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్