ప్రభుత్వ హాస్టళ్ళు హీనంగా ఉన్నాయి: బూర

1065చూసినవారు
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్ళు అధ్వాన్నంగా ఉన్నాయని శనివారం భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. భువనగిరిలో అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించి మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఘటనకు కారణమన్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించి ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాశం భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్