మంగళగిరిలోని చేనేత కార్మికులతో ఇవాళ ఏర్పాటు చేసిన ముఖాముఖిలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నారా లోకేశ్ మాదిరిగా మంగళగిరి వైసీపీ అభ్యర్థి లావణ్య వద్ద డబ్బులు లేవు. లోకేశ్ ఓటుకు రూ.6 వేలు పంచుతాడు. డబ్బిస్తే తీసుకోండి.. వద్దనొద్దు. కానీ జూన్, జులైలో అమ్మఒడి, చేయూత, నేతన్న నేస్తం ఎవరు ఇస్తారో వారికే ఆలోచించి ఓటు వేయండి.' అని పేర్కొన్నారు.