విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ సమావేశం

74చూసినవారు
భువనగిరిలో శనివారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 23న జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే హనుమాన్ విజయ బైక్ ర్యాలీ విజయవంతం కోసం ఈ సమావేశం నిర్వహించగా, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పోత్నక్ రవీందర్ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి యువత తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్