ఎండలో వెళ్ళేటప్పుడు కానీ, వెళ్లి వచ్చాక కానీ చల్లని నీళ్లను లేదా ఐస్ నీళ్లను తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే మనిషి గుండెలోని సిరలు, రక్తనాళాలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే గోరు వెచ్చని నీటిని నెమ్మదిగా తాగాలి. ఇంకా బయటి నుంచి రాగానే స్నానం చేయాలనుకుంటే.. కనీసం అరగంట సేపైనా వేచి చూడాలని నిపుణులు చెబుతున్నారు.