వాహన తనిఖీలు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో భువనగిరి పట్టణ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా రూ. 50వేలకు మించి నగదును తీసుకవెళ్లిన వాటికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించాలన్నారు. సరైన పత్రాలు లేకపోతే నగదును సీజ్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు.