భువనగిరి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన
భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి మండలం సురేపల్లితండా మాజీ సర్పంచ్ (కుమారుడు) కేతావత్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు ధర్నా చేపట్టారు. రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.