రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు వైసీపీ నేతలు గవర్నర్ను కలవనున్నారని సమాచారం. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని అన్నారు.