సీఐడీ విచారణకు హాజరుకానున్న యడ్యూరప్ప

72చూసినవారు
సీఐడీ విచారణకు హాజరుకానున్న యడ్యూరప్ప
తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జూన్ 17వ తేదీన సిఐడి ముందు హాజరవుతానని మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప శనివారం తెలిపారు. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన బెంగళూరులో అన్నారు. ఈ కేసుకు సంబంధించి యడ్యూరప్పను అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు శుక్రవారం సీఐడీని నిలువరించింది. ఈ మేరకు సీఐడీ ఎదుట జూన్ 17న హాజరుకావాలని ఆయనను కోర్టు ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్