AP: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఏపీలో నమోదైందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. EVMల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం ఓట్లు పడ్డాయని చెప్పారు. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు.