బస్సు బోల్తా.. ఒకరు మృతి, 18 మందికి గాయాలు

66చూసినవారు
బస్సు బోల్తా.. ఒకరు మృతి, 18 మందికి గాయాలు
హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. రోహతంగ్ పాస్ సమీపంలోని గుంధీ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులు అంతా ముంబైకి చెందిన వారని మనాలీ డీఎస్పీ శర్మ తెలిపారు. అదుపు తప్పడంతో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ క్షేమంగా ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్