పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి SSC బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ ఘటనలు జరగకుండా ప్రశ్నపత్రాన్ని ప్రత్యేక టెక్నాలజీతో కూడిన క్యూఆర్ కోడ్తో ముద్రించనున్నట్లు బోర్డు డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు. ఈ కోడ్ సాయంతో ఎవరైనా పేపర్ లీక్ చేస్తే.. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఊరు? ఏ సెంటరు? ఏ విద్యార్థికి సంబంధించిందో? అనే వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.